పోక్సో కేసుపై యువకుడు జైలుకు..
1 min read
మిడుతూరు ఎస్ఐ ఓబులేష్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు జైలు పాలయ్యాడు.నంద్యాల జిల్లా మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపిన వివరాల మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఇదే గ్రామానికి చెందిన పి. రాజశేఖర్ కుమారుడు నాగ చరణ్ తేజ (20)ఈనెల 18వ తేదీన మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ముద్దాయిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నవంబర్ 13 వరకు కోర్టు రిమాండ్ విధించినట్లు గురువారం సాయంత్రం ఎస్సై తెలిపారు.

