NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించిన వైసీపీ విభాగాల అధ్యక్షులు..

1 min read

వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండల వైస్సార్సీపీ పార్టీ అనుబంధ విభాగల అధ్యక్షులు గా నియమించినందుకు,

న్యూస్ నేడు ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  ఆలూరు మండల యూత్ అధ్యక్షులు ఎం పెద్ద రాజశేఖర్ ,సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఎర్రన్న ,బీసీ సెల్ అధ్యక్షులు డిటి తిక్క స్వామి మైనార్టీ సెల్ అధ్యక్షులు శర్మస్ ఖాన్ , ఎంప్లాయిస్ అధ్యక్షులు హనుమంతు ,  కలిసిఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ని  మర్యాదపూర్వకంగా కలిసి  ఘనంగా సన్మానించడం జరిగింది.ఆలూరు మండల యూత్ అధ్యక్షులు ఎం పెద్ద రాజశేఖర్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు ఎర్రన్న, బీసీ సెల్ అధ్యక్షులు డిటి తిక్క స్వామి,మైనార్టీ సెల్ అధ్యక్షులు శర్మస్ ఖాన్,ఎంప్లాయిస్ అధ్యక్షులు హేమంత్ మాట్లాడుతూ… మాపై నమ్మకంతో వైఎస్ఆర్సిపి పార్టీ మండల పదవులు ఇచ్చినందుకు  గాను వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి కు  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కు రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ , యువనేత బుసినే చంద్రశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిజేస్తున్నాను, మరీ ముఖ్యంగా  ఆలూరు ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి  కుటుంబనికి రుణపడి ఉంటాను తెలపడం జరిగింది.ఈకార్యక్రమం వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author