జిల్లా కలెక్టర్ చొరవతో 22ఏ భూములకు మోక్షం
1 min read
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22A సమస్యకు పరిష్కరం
చకా చకా 22ఏ నిషేధిత జాబితా భూములకు విముక్తి
ఏలూరు జిల్లాలో ఒక్క రోజులోనే 142 ఏకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగింపు… భూమి యజమానులకు ఊరట
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రభుత్వం 22-ఏ భూ సమస్యలను పరిష్కరించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. దీనివల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలకు నోచుకోని వేలాది ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందుతున్నాయి.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏలూరు జిల్లాలోని కలిదిండి మండలం కలిదిండి గ్రామంలోని సర్వే నంబర్లు 1051, 1083, మరియు 1084 లలోని కొన్ని భూములను, రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని సెక్షన్ 22-A(1)(e) కింద నిషేధిత ఆస్తుల జాబితా నుండి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.రెవెన్యూ రికార్డులలో “అనాధీనం”గా వర్గీకరించబడిన ఈ భూములను 1954కు ముందు కేటాయించారని, మరియు అనేక దశాబ్దాలుగా చట్టబద్ధమైన వారసులు, రిజిస్టర్డ్ పత్రాల ద్వారా నిరంతర చట్టబద్ధమైన లావాదేవీలు జరిగాయని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గుర్తించి భూపరిపాలన కమిషనర్ వారికి ప్రతిపాదించిన మేరకు వారు కనుగొన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.నిషేధిత జాబితా నుండి తొలగించడానికి గతంలో జారీ చేసిన జీవోలు మరియు సర్క్యులర్ మెమోలలో నిర్దేశించిన షరతులకు ఈ భూములు అనుగుణంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. జిల్లా రిజిస్ట్రార్ మరియు సబ్-రిజిస్ట్రార్ సహా అధికారులకు రికార్డులను తదనుగుణంగా నవీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం తీసుకున్న సానుకూన చర్యలతో భూమి యజమానులు తమ సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లకు తమ కృతఙ్ఞతలు తెలియజేసారు.

