గరుకు స్తంభాల ఏర్పాటు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని శ్రీసూర్య నారాయణ స్వామి దేవాలయ గోశాలలో మంగళవారం ‘గరుకు స్తంభాల’ ఏర్పాటు కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. దాతల ఆర్థిక సహకారంతో, ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఈ పుణ్యకార్యం దిగ్విజయంగా పూర్తయింది. పవిత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోమాతలను దర్శించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరూ భక్తితో తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

