ట్రాన్స్ ఫార్మర్ విలువైన పరికరాలు దోపిడీ
1 min read
రైతుకు రెండు లక్షల నష్టం..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: రైతు పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లో ఉన్న విలువైన పరికరాలను దుండగులు తీసుకువెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన రైతు కాటెపోగు నాగరాజు తెలిపిన వివరాల మేరకు కడుమూరు- నాగలూటి గ్రామాల మధ్యనున్న నాకున్న నాలుగు ఎకరాల పొలంలో ట్రాన్స్ ఫార్మర్ వేయించుకోవడం జరిగిందని ఫ్రాన్స్ ఫార్మర్ కు ఉన్న కరెంటు కనెక్షన్ ను బొంగు కర్రతో తొలగించి రాత్రివేళ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగలు, ఆయిల్ విలువైన వస్తువులను దుండగులు తీసుకువెళ్లారని రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.అధికారులు న్యాయం చేయాలని బాధిత రైతు కోరారు.మిడుతూరు పోలీస్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ మరియు రైతు ఫిర్యాదు చేశారు.


