NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు

1 min read

– ఆలూరు టీడీపీ “ప్రజా గ్రీవెన్స్” కార్యక్రమం విజయవంతం

వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ప్రజల అర్జీల స్వీకరణ – వెంటనే స్పందన, అధికారులతో చర్చలు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా గ్రీవెన్స్” కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా తెలియజేశారు.గ్రామాల నుండి వచ్చిన పలు సమస్యలపై  వైకుంఠం జ్యోతి  వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ప్రజల అర్జీలను స్వీకరించి, ప్రతి సమస్యపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు.ఈ కార్యక్రమం ప్రజల సమస్యలపై నాయకత్వం యొక్క బాధ్యతను చాటిచెప్పడంతో పాటు, “ప్రజల పక్కన – ప్రతి సమస్యకు పరిష్కారం” అనే నినాదాన్ని సాకారం చేసింది. ప్రజల హృదయాల్లో విశేష స్థానం సంపాదించిన ఈ కార్యక్రమం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *