NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేజీఎన్ టైల్స్ లో తప్పిన ప్రమాదం

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కర్నూలు రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న కేజీఎన్ టైల్స్ మరియు గ్రానైట్స్ గోడౌన్ లో కరెంట్ సర్క్యూట్ వల్ల భారీ ప్రమాదం తప్పింది.శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.కేజీఎన్ టైల్స్ అధినేత అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ గోడౌన్ పక్కన ఉన్న డిష్ సంబంధించిన వ్యక్తి 11 కెవీ విద్యుత్ తీగలు వేయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.గోడౌన్ లో ఉన్న వస్తువులు కాలి బూడిద అయ్యాయి.వెంటనే అప్రమత్తమై కరెంట్ కనెక్షన్ తొలగించి నీళ్లతో మంటలను అదుపు చేశారు.తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి నీటితో మంటలను సద్దుమణిగేలా చేశారు.50వేల నష్టం వాటిల్లినట్లు టైల్స్ యజమాని గఫార్ తెలిపారు.

About Author