PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు అవసరమైన పెన్నులతో కూడిన విద్యా సామాగ్రిని హిందీ ఉపాధ్యాయిని సుజాత భాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని సొంత ఖర్చులతో ఉచితంగా అందించడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు ఆ విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకుని బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి, విజయసారథి రెడ్డి, రామయ్య ,నబి రసూల్, శంకరయ్య, రెడ్డయ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author