PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వల్ప స్కోర్​కే చాపచుట్టేసిన శ్రీలంక

1 min read


పల్లెవెలుగు వెబ్: టీ-20 ప్రపంచకప్‌(T-20 Worldcup)లో దక్షిణాఫ్రికా(south africa) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక (srilanka)స్వల్ప స్కోర్‌కే చాపచుట్టేసింది. ప్రొటీస్ జట్టుకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఓపెనర్ పీతమ్‌ నిశాంక (72) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్‌ షంసి, డ్వెయిన్‌ ప్రిటోరియస్ మూడు వికెట్లు, అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు పడగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక పవర్ ప్లేను సరిగి వినియోగించుకోలేదు. లంక బ్యాటర్లు నెమ్మదిగా ఆడారు. నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (7) అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి లంక కేవలం 39 పరుగులు చేసి ఒక వికెట్(wicket) కోల్పోయింది. భానుక రాజపక్సే (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4) ఇలా వచ్చి అలా పెవిలియన్ దారి పట్టారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్‌ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో ఆఫ్ సెంచరీ(half centuary) పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సరతో స్కోర్ బోర్డు(score board) ను పరుగులు పెట్టించినా.. మరో ఎండ్‌లో అతనికి సహకరించే వారే కరువయ్యారు. దీంతో లంక జట్టు 20 ఓవర్లకు కేవలం 143 పరుగులు(runs) మాత్రమే చేయగలిగింది.

About Author