PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారత్ – పాక్ సరిహద్దుల్లో అలజడి

1 min read


పల్లెవెలుగు వెబ్: పంజాబ్‌లోని భారత్ – పాక్ సరిహద్దులో టిఫిన్ బాక్స్ బాంబ్ కలకలం సృష్టించింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలతో నిండిన టిఫిన్ బాక్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రదాడి ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు పోలీసులు తెలిపారు. జలాలాబాద్ పేలుడు కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా టిఫిన్ బాక్సు బాంబు బాగోతం బయటపడింది. దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు అలీ కే గ్రామంలో టిఫిన్ బాక్సు బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.

About Author