PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీపై మంత్రి సమీక్ష: త్వరలో బస్సు చార్జీలు పెరిగే అవకాశం

1 min read


పల్లెవెలుగు వెబ్: తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగే అవకాశం ఉంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. చార్జీల పెంపుపై సమావేశంలో చర్చించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులు, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో కిలోమీటరుకు 30 పైసల చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ చార్జీల పెంపునకు ప్రభుత్వం ఆమోదం ముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించినట్లుగా సమాచారం. సీఎం ఓకే అన్న తర్వాత చార్జీలను పెంచనున్నారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, పాల్గొన్నారు.

About Author