PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయ‌న ఆహ్వానిస్తేనే వ‌చ్చా.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల పై సీఎంతో జ‌రిగిన భేటీ సంతృప్తినిచ్చింద‌ని చిరంజీవి అన్నారు. నిర్మాత‌లు, సినీ కార్మికులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల బాధ‌లు సీఎంకు విన్న‌వించాన‌ని చిరంజీవి తెలిపారు. సినిమా ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల పై సీఎం జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న చెప్పారు. ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, క‌మిటీ తుది నిర్ణ‌యానికి వ‌స్తుంద‌ని సీఎం చెప్పిన‌ట్టు చిరంజీవి పేర్కొన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఎవ‌రూ నోరు జారొద్ద‌ని, ఇండిస్ట్రీ పెద్ద‌గా కాకుండా .. ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ బిడ్డ‌గా విజ్ఞ‌ప్తి చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. సీఎంతో జ‌రిగిన చ‌ర్చ గురించి ఇండ‌స్ట్రీకి చెందిన వారితో చ‌ర్చిస్తాన‌ని, వారి సూచ‌న‌లు మ‌రోసారి సీఎంకు విన్న‌విస్తాన‌ని తెలిపారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా తానొక్క‌డే ఈ భేటీకి హాజ‌రు కాలేదని, సీఎం ఆహ్వ‌నిస్తేనే వ‌చ్చాన‌ని తెలిపారు.

                                               

About Author