PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలలకు సెలవులు ఇచ్చేది లేదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కరోన కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. పిల్లలకు కరోన సోకితే ఆ పాఠశాల మూసివేసి తర్వాత ప్రారంభిస్తామని అన్నారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడ నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడ పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి సురేష్ తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం ఆన్ లైన్ విధానం తప్ననిసరి అని చెప్పారు. ఆన్ లైన్ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్ పెరుగుతుందని ఆయన తెలిపారు.

          

About Author