PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ డ్రస్సుతో వస్తే కాలేజీలోకి నో ఎంట్రీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : హిజాబ్ నిషేధించాలని కర్ణాటకలోని ఓ కాలేజీ నిర్ణయించింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ గాళ్స్ కాలేజీలో జరిగిందీ ఘటన. కుందాపూర్ బీజేపీ ఎమ్మెల్యే హాలాడి శ్రీనివాస్ శెట్టి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 25 మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఇలా కాషాయ కండువాలు ధరించారు. కాగా, హిజాబ్‌ను నిషేధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ముస్లిం విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు లేని నిబంధనను కొత్తగా అమలు చేస్తాన్నారని విమర్శించారు. దీనిపై విద్యార్థినులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లనున్నారు.

   

About Author