PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలలో కూడ దెయ్యంలానే కనబడుతా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసి ఉంటే తన లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా కేజ్రీవాల్ ని చోటా మోదీ అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో కేజ్రీ వాల్ స్పందించారు. తనను ఏమైనా అనుకోనివ్వండి.. దాని వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సూర్జేవాలాకు తాను కలలో కూడ దెయ్యంలాగా కనబడుతానని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ తనను దూషిస్తుంటారని, ప్రజల కోసం తాము పనిచేసినందువల్లే తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.

           

About Author