PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ వివాదం పై కమల్ హాసన్ విచారం !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయని ఆయన అన్నారు. ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య విషపు గోడగా నిలుస్తోందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మారుతోందని అన్నారు. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

            

About Author