PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్యాయం చేసిన వారే అన్యాయం జరిగిందంటున్నారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ విభజన తీరుపై పార్లమెంట్ లో చర్చ జరగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విభజన వేళ ఏపికి జరిగిన అన్యాయం పై పార్లమెంట్లో రాష్ట్ర పార్టీలు గళమెత్తాలని కోరారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చర్చకు కోరాలని అన్నారు. చర్చ జరిగితే అన్యాయం దేశానికి తెలుస్తుందన్నారు. అన్యాయం చేసిన వారే అన్యాయం జరిగిందంటున్నారని అన్నారు. అన్యాయంపై అడగటానికి రాష్ట్ర పార్టీలకు భయమెందుకని ప్రశ్నించారు. సీఎం జగన్ సమర్థవంతమైన వ్యాపారవేత్త అని, రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం లేదని అన్నారు..

  

About Author