PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖ‌మ్మం జిల్లాలో జూ. ఎన్టీఆర్ సోద‌రి

1 min read

తెలుగుదేశంపార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద‌మూరి సుహాసిని ఖమ్మం జిల్లాలో ప‌ర్యటించారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, మూటాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కర‌ణ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి సుహాసిని మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌ల ఆస్తి అని అన్నారు. ప్రాంతాల‌తో సంబంధం లేకుండా తెలుగు వారి ఆత్మగౌర‌వం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు వారిని మ‌ద్రాసీలు అని పిలుస్తున్న కాలంలో.. తెలుగువారి ఔన్నత్యాన్ని దశ‌దిశ‌లా వ్యాపింప‌చేశార‌ని అన్నారు.

About Author