PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాకిస్థాన్ పేరెత్తితే క‌డుపు నిండుతుందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ పై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ విరుచుకుప‌డ్డారు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ప్రజోపయోగం లేని చర్చలను తెరపైకి తెస్తున్నారని అధికార భారతీయ జనతా పార్టీపై ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక వారిని మభ్యపెట్టేందుకు ఇలాంటివి తెరపైకి తీసుకు వస్తున్నారని ఆమె మండి పడ్డారు. పాకిస్తాన్ పేరు తీస్తేనో బుల్డోజర్లు నడిపిస్తేనే ప్రజలు కడుపు నిండదని, ప్రజలకు అవసరమైన పనుల గురించి చర్చ జరగాలని ఆమె కోరారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

                              

About Author