NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ఆర్ఆర్ కు చేయాల్సిన‌వ‌న్నీ చేస్తామ‌న్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన వీరిద్దరూ సినిమా టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షో ఇతర అంశాలపై చర్చలు జరిపారు. మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతున్న దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం రాజ‌మౌళి మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు చేయాల్సిన‌వ‌న్నీ చేస్తామ‌ని సీఎం చెప్పిన‌ట్టు రాజ‌మౌళి పేర్కొన్నారు. ఖ‌ర్చు పెట్టిన సినిమా కాబ‌ట్టి అందుకు కావాల్సినవ‌న్నీ చేస్తామ‌ని సీఎం హామీ ఇచ్చార‌ని అన్నారు.

                                                   

About Author