PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ నారాయ‌ణ పై జోకులేసిన చంద్ర‌బాబు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని హోటల్ దస్పల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.. తెలుగుదేశం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో రాజకీయాల్లో సమాకాలీకులైన టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నేత నారాయణ మధ్య సదరా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా నారాయణపై చంద్రబాబు జోకులేశారు. నారాయణ సిద్ధాంతం కోసం పనిచేస్తే.. ప్రజల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. ‘‘ నష్టపోయిన ఏపీని పునర్‌నిర్మించేది టీడీపీనే. ఎన్టీఆర్ శత జయంతి, మహానాడును వైభవంగా నిర్వహిస్తాం. ప్రాంతీయ పార్టీతో దేశ రాజకీయాలను వాదించింది ఎన్టీఆరే.. అధికారమే శాశ్వతం అనుకుంటే ఓడిపోయేవాడిని కాదు.“ అని చంద్ర‌బాబు అన్నారు.

                                 

About Author