PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ పీజీఈసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీ ఈసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంటెక్‌/ ఎంఫార్మసీ/ ఫార్మాడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌/ ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. సీట్ల భర్తీలో గేట్‌/ జీప్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. తరవాతనే ఏపీపీజీఈసెట్‌ 2022 స్కోర్‌ సాధించిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

                                    

About Author