PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌న ఇంటికి నిప్పు పెట్ట‌డం పై స్పందించిన ఏపీ మంత్రి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు పెట్టారు. దీనిపై మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ.. ‘నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్‌ చేశాయి. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి’ అని మంత్రి విశ్వరూప్‌ కోరారు.

                                 

About Author