PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ తేదిల్లో బ్యాంకులు ప‌నిచేస్తాయి.. వ‌దంతులు న‌మ్మొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మే నెల 30,31 తేదీల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయని, ఉద్యోగుల రెండు రోజుల సమ్మె అనే వదంతులను నమ్మొద్దని బ్యాంక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయమై బ్యాంక్‌ అధికారులు మాట్లాడుతూ, బ్యాంక్‌ శాఖల తగ్గింపు, ఉద్యోగుల బదిలీలకు నిరసన తెలియజేస్తూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30,31 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి బ్యాంక్‌ ఉద్యోగుల సంఘ సమాఖ్య నిర్వాహకుల మధ్య జరిగిన చర్చలతో రాజీ కుదిరింది. దీంతో సమ్మె ఉద్యోగులు వాయిదావేశారు.

                                         

About Author