PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ కు బిగ్ షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు మాజీ మంత్రులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో రాజ్‌కుమార్‌ వెర్కా, బల్బీర్‌ సింగ్‌ సిద్ధూ, గుర్‌ప్రీత్‌ సింగ్‌ కాంగార్‌, సుందర్‌ శ్యామ్‌ అరోరాతో పాటు మరో ఇద్దరు సీనియర్‌ నేతలు కమల్జీత్‌ ధిల్లాన్‌, కేవల్‌ ధిల్లాన్‌ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అశ్విని శర్మ, ఆపార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమక్షంలో వారంతా కమలం కండువా కప్పుకున్నారు.

                                               

About Author