PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల ప‌రిస్థితి ద‌య‌నీయం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. నాయకుల వైఫల్యమని అధికారులు, అధికారుల వైఫల్యమని నాయకులంటున్నారని మండిపడ్డారు. 13 లక్షల 42 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేనిదిగా మారిందని తెలిపారు. ఉద్యోగస్థులకు 1వ తేదీనే జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. 70 సంవత్సరాలు దాటినవారికి అడిషనల్ కోటా పెన్షన్‌ను తీసేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడం బాధాకరమన్నారు.

                                                    

About Author