PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో బెంబేలెత్తిస్తున్న చిరుత‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప కొండపై రెండు చిరుతల కలకలం రేపుతున్నాయి. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతులు, కుక్కలు, గొర్రెలను చంపి చిరుత పులులు తింటున్నాయి. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. తిమ్మప్ప కొండపై రెండేళ్లుగా చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో రాత్రి వేళల్లో చిరుతల కోసం గ్రామస్థులు పహారా కాస్తున్నారు. రెండేళ్లుగా చిరుతలు సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

                                       

About Author