PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర‌ద‌ల‌కు విదేశీ కుట్ర కార‌ణ‌మా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భద్రాద్రిలో ఊహించని విధంగా వరదలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్‌ పర్యటించారు. దేవుడి దయవల్లే కడెం ప్రాజెక్ట్‌కు ప్రమాదం తప్పిందన్నారు. క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో ఇలాగే కుట్రలు చేశారని తెలిపారు. గోదావరి నది దగ్గర కూడా కుట్ర చేశారని అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

                                          

About Author