PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పుల పై ఏపీ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారని పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, నేడు సాక్షి పత్రికలో కథనాలు రాస్తున్నారని, మీరు చెబుతున్నది వాస్తవాలైతే గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం పాలన, ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు గాలికి వదిలేశారని చెబుతున్నవారు… అప్పుడు నిద్ర పోయారా? అని ప్రశ్నించారు.

                                   

About Author