PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప.. జేఏసీ ఆధ్వర్యంలో ఏజెంట్లు ధర్నా

1 min read

పల్లెవెలుగు , వెబ్​ కడప: దేశవ్యాప్తంగా చేపడుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఏజెంట్లు చేస్తున్న ఆందోళన లో భాగంగా కడపనగరంలోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం ఎదుట లియో ఫీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుంచి 14 వ తరగతి వరకు నిరసనలో కార్యక్రమంలో భాగంగా రెస్ట్ డే పేరుతో ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ సంఘం అధ్యక్షులు ఆర్ నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ పాలసీదారుల బోనస్ పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే జీఎస్టీ రద్దు చేయాలన్నారు. ఐదేళ్లు దాటిన ఎల్ఐసి పాలసీ లన్నీ తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎల్ ఐ సి ఏజెంట్ లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఆరోగ్య బీమా సౌకర్యం . గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్ రెడ్డి, చెన్నయ్య యాదవ్, రమణారెడ్డి, వెంకట రామి రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, నాగ శివారెడ్డి, మల్లికార్జున, నరసయ్య పలువురు ఎల్ఐసి ఏజెంట్ లు పాల్గొన్నారు .

About Author