NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం…

1 min read

– రాయలసీమ శకుంతల
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: దేశ సౌభాగ్యం కోసం, శాస్త్రా సాంకేతిక రంగం అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుల సేవలు ఎప్పటికి మరువరాదని అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి,రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు,వైసీపీ నాయకురాలు రాయలసీమ శకుంతల అన్నారు.మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్బంగా మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజా గారికి ఆయన చిత్రపటాన్ని ఇచ్చి… షెల్టర్ కి రావాల్సిన బిల్లుల గురించి మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు రెన్యువల్ బిల్లుల విషయం గురించి స్పందించడం జరిగింది. అలాగే అశోక్ నగర్ లోని పట్టణ మహిళా వసతి గృహంలో రాయలసీమ శకుంతల ఏ పి జే అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా జి. శకుంతల మాట్లాడుతూ అబ్దుల్ కలాం మంచి మేధావి, నీతి, నిజాయితీ కి మారు పేరు, గొప్ప రాజనీతిజ్ఞుడు, అట్టడుగు నుండి దేశ రాష్ట్ర పతిగా ఎన్నికయ్యారన్నారు దేశానికి మార్గదర్శకుడిగా ఎదిగాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం మేనేజర్ యామిని, నిరాశ్రయులు. పాల్గొన్నారు.

About Author