PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి మండల నాయకుడు దారుణ హత్య..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గోనెగండ్ల: గోనెగండ్ల మండలం పరిధిలోని కున్నూరు గ్రామానికి చెందిన టిడిపి మండల నాయకుడు, కోట్ల అనుచరుడైన సిద్ధప్పను కోడుమూరు లో గుర్తుతెలియని దుండగులు బుధవారం దారుణంగా హత్య చేశారు. గత కొంత కాలంగా మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు పట్టణంలో నివాసం ఉంటూ గోనెగండ్ల మండల టిడిపి కార్యక్రమాలలో చురుకుగా పనిచేసేవాడు.వివరాల్లోకి వెళితే గతంలో దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన వెంకటప్పనాయుడు హత్య కేసులో మూడవ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.ఈ హత్యకు ప్రధాన కారణం పాత కక్షలు భూతగాదాలు అని ప్రజలు అనుకుంటున్నారు.

About Author