PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ వెంకటేశ్ కు నిరసన సెగ

1 min read

పల్లెవెలుగువెబ్ : మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ దత్తత గ్రామంలో గ్రామస్థులు ఆయనకు వ్యక్తిరేకంగా నిరసనకు దిగారు. కర్నూలు మండలంలోని ఈ -తాండ్రపాడు నుండి దేవమాడ గ్రామం వరకు రోడ్లు అద్వానంగా ఉండడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈమేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ, తాండ్రపాడు నుండి దేవమాడ వరకు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచలింగాల నుండి గొందిపర్ల గ్రామం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారుగానీ ఆ లైట్లు వెలగడం లేదని గ్రామస్థులు అన్నారు.

About Author