PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి

1 min read

పల్లెవెలుగు,వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణంలోని జగనన్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీగా స్థానిక తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏం సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో పనులు ప్రస్తుతం నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రధానంగా కోయిలకుంట్ల పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న కాలనీలో వర్షాలు పడడం వల్ల రోడ్లు పూర్తి అద్వాన స్థితిలో ఉన్నాయి కనీసం మెటీరియల్ తోలుకోవడానికి ట్రాక్టర్లు గాని ,ఇతర వాహనాలు తిరగడానికి లేని పరిస్థితి ఉందన్నారు. లబ్ధిదారులు పనులు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున వెంటనే ఆ కాలనీలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాములమ్మ, షరీఫ్, దస్తగిరి ,హుస్సేన్ ,రామలక్ష్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author