PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్లు సరఫరా ఏజెన్సీపై డిఇఓ ఆగ్రహం

1 min read

– ఉడికిన గుడ్లు నల్లగా మారడంపై జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజ్ ఆగ్రహం
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉడికిన గుడ్లు నల్లగా మారడంపై జిల్లా విద్యాశాఖ అధికారి జయరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం చెన్నూరు ఉర్దూ ప్రాథమిక పాఠశాలను దేవరాజ్ సందర్శించారు. మధ్యాహ్నం భోజనం సంబంధించి అలాగే ఉడికిన గుడ్లు నల్లగా మారడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వంట ఏజెన్సీ వారితో చర్చించారు. చెన్నూరు మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కూడా గుడ్లు నల్లగా మారడంపై గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ వారిపై డిఇఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే మెమోలు జారీ చేయడం జరుగుతుందని ఉపాధ్యాయులకు సూచించారు. వంట ఏజెన్సీ వారు తయారుచేసిన భోజనము కూరలు గుడ్లు పరిశీలించిన తర్వాతే పిల్లలకు ఇవ్వాలని కోరడం జరిగింది. నల్లగా మారిన గుడ్లను వాడ రాదని వారికి తెలియజేశారు.

About Author