PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సిఎం జగనన్న

1 min read

– ఎమ్మెల్సీ ఇషాక్ బాషా
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా 341 రోజుల పాటు ప్రజా క్షేత్రంలో పాదయాత్రగా 3648 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో నేను విన్నాను.. నేనున్నాను అని భరోసా కలిగించి ప్రజాసంకల్ప యాత్ర పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్సీ ఇషాక్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ భాష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారని రాష్ట్రంలో ప్రతి ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు కూడా సంక్షేమ పథకాలతో చాలా సంతోషంగా ఉన్నారని అదేవిధంగా తెలుగుదేశం నాయకులు బాదుడే బాదుడు అనే కార్యక్రమం ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలకు మంచి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు 2024 లో వచ్చే ఎన్నికలలో కూడా ముఖ్యమంత్రిగా జగనన్న వస్తారని ప్రజలకు మరిన్ని పథకాలను అందిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ మా భూన్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పామ్ షావలి, మాజీ మున్సిపల్ చైర్మన్ కైపరాముడు ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం, కౌన్సిలర్స్ సాధిక్ భాష, మనోరంజని ,వైయస్ఆర్ సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, అనిల్ అమృతరాజ్ ,కిరణ్ కుమార్ ,జాకీర్ హుస్సేన్, మునయ్య ,రహంతుల్లా, సోమశేఖర్ రెడ్డి, పార్థసారథి, నాగరాజు ,మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author