PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంజనీరింగ్ అసిస్టెంట్ల డైరీ ఆవిష్కరణ

1 min read

– ఇంజనీరింగ్ అసిస్టెంట్ల డైరీని ఆవిష్కరించిన జిల్లా అధికారి రామ్ మోహన్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎస్ఇ. రామ్ మోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి డైరీని ఎస్ఈ రామ్మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పనులలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమైనదని అందరూ మరింత కష్టపడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ప్రాధాన్యత భవనాలు,మన బడి నాడు నేడు,హౌసింగ్ తదితర అన్ని పనులలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రమోషన్ ఛానెల్,నాన్ టెక్నికల్ వర్క్స్ తదితర ఫీల్డ్ లెవెల్ సమస్యలను ఎస్ఈ కి తెలుపగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అసోసియేషన్ జిల్లా అడాక్ అధ్యక్షులు వంశీధర్,ప్రధాన కార్యదర్శి బాలయ్య,ట్రెజరర్లు సుంకన్న,వెంకటేశ్వర్లు,టెక్నికల్ కో ఆర్డినేటర్ అజయ్,జిల్లా కమిటీ సభ్యులు నరేష్,రమ్య తదితరులు పాల్గొన్నారు.

About Author