PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠకులను అలరిస్తున్న ఏకైక పత్రిక పల్లెవెలుగు : ఎమ్మెల్యే

1 min read

– ఎం ఎల్ ఏ మేడా చేతులమీదుగా పల్లెవెలుగు వెబ్ &ధినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రజాసమస్యలపై అనునిత్యం సామాజిక బాధ్యతతో, లక్ష్యంతో, ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఆశతో ముందుకు సాగిపోతున్న తెలుగు పత్రిక పల్లెవెలుగు దినపత్రిక అని రాజంపేట ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి గారు పేర్కొన్నారు. గురువారం వీరబల్లి మండల పరిధిలోని తాటి గుంట పల్లి గ్రామ సచివాలయం లో ఎం పి పి గాలివీటి రాజేంద్ర నాధ్ రెడ్డి మరియు వై సి పి శ్రేణులతో కలిసి పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలోని ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ వంటి 14 భాషలలో ఎన్నో దిన, వార ,పక్ష, మాస పత్రికలు రిజిస్టర్ అవుతున్నాయి. కానీ అవిమూన్నాల్ల ముచటగా అవి కనుమరుగవుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో పల్లెవెలుగు ధినపత్రిక పాఠకులకు వివిధ స్టోరీలతో, వ్యాసాలతో, కార్టూన్లతో, ప్రెస్ మీట్ లు, ధర్నాలు ,దీక్షలు ,యాక్సిడెంట్లు, కెమెరాలతో చిత్రీకరించిన రంగురంగుల ఫోటోలు, వివిధ శీర్షికలతో పాఠకులకు అలరిస్తున్న ఏకైక పత్రిక అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి తెలుగు పత్రికలను అందరూ ఆదరించి, ప్రోత్సహించాలన్నారు.పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొపినాధ్ రెడ్డి,జడ్ పి టి సి శివరామ, వై సి పి నాయకులు గాలివీటి వీరనాగిరెడ్డి ,వి ఆర్ రెడ్డి, సుబ్బరామరాజు, నాగబూషణం,కిషోర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వెంకట్రాజు,తిమ్మారెడ్డి ,రామచంధ్ర రెడ్ది తధితరులు పాల్గొన్నారు.

About Author