PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దమ్ముంటే ఎదురుగా రండి.. చూసుకుందాం..!

1 min read

– చిల్లర పనులు చేస్తే.. సహించేది లేదు..

-జగనన్న ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సిద్ధార్థన్న పోటీ

– సహకార సొసైటీ చైర్మన్​ టి. నాగ తులసిరెడ్డి

 పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: దమ్ముంటే ఎదురుగా రండి చూసుకుందాం.. చిల్లర పనులు చేస్తే మాత్రం సహించేది లేదు కటౌట్ కాల్చడం పట్ల సహకార సొసైటీ చైర్మన్ టి.నాగ తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కర్నూలులో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కటౌట్ ను పెట్రోల్ పోసి అంటించారు.ఈసంఘటన జరగడం చాలా దుర దృష్టకరమన్నారు.ఈసందర్భంగా ఆయన మిడుతూరు సహకార సొసైటీ కార్యాలయంలో తులసి రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షమైనా లేక మరెవరైనా సరే చిల్లర రాజకీయాలు మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రైవేట్ సైన్యం ఏ విధంగా ఉందో అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నకు కూడా  ప్రైవేటు సైన్యం ఉందనేది తెలుసుకోవాలన్నారు. సిద్ధార్థన్నను కాపాడుకోవడానికి ప్రైవేటు సైన్యం సిద్ధంగా ఉందని దొంగ చాటున ఫ్లెక్సీలు కాల్చడం వంటిది చేసిన వారి పైన పోలీసులు కేసు నమోదు చేసి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.సిద్ధార్థన్నను ఎదుర్కోలేకే ఇవన్నీ చిల్లర పనులు చేస్తున్నారని ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధార్థన్న సిద్ధంగా ఉన్నారని తులసి రెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,వైస్ ఎంపీపీ తుపాకుల నబి రసూల్,రోళ్లపాడు గ్రామ సర్పంచ్ నాగారెడ్డి రామస్వామి రెడ్డి,చిన్న ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author