PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకున్న గౌరు వెంకట్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నంద్యాల జిల్లా టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి మానవత్వం చాటుకున్నారు. శనివారం నందికొట్కూరు మండలం బ్రహ్మణకోట్కూరు సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిలో బ్రహ్మణకొట్కూరు గార్గేయ పురం గ్రామాల మద్య లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమయంలో అదే దారిలో వెళ్తున్న నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కారులో నుంచి దిగి యువకుడిని పరామర్శించి 108కు ఫోన్ చేసి దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు తెలిపారు.

About Author