NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముమ్మరంగా ఎమ్మెల్సీ ప్రచారంలో టిడిపి శ్రేణులు

1 min read

– 13న జరిగే ఎన్నికల్లో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికే మీ ప్రథమ ఓటు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిడుతూరు మండలంలో టిడిపి నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.మండల పరిధిలోని చెరుకుచెర్ల, బైరాపురం, తిమ్మాపురం గ్రామాలలో టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు గుండం రమణారెడ్డి పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి వారు ప్రచారం నిర్వహించారు.ఈనెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులను కోరారు.ఈవైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలని ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి శూన్యమని నాయకుల సంపాదన కోసమే కానీ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని వారు అన్నారు.ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల టిడిపి నాయకులు గుండం సర్వోత్తమ్ రెడ్డి,పేరెడ్డి మహేశ్వర రెడ్డి,వైయస్ఆర్సీపీ మైనారిటీ సంఘం మండల అధ్యక్షుడు మొల్ల చాకర్ వలి,దుర్గా ప్రసాదరావు,రమణారెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,ఆనంద్, మిడుతూరు సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author