PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో: కడప శివారులోని రిమ్స్​ వద్ద కోవిడ్​–19 బాధిత కుటుంబీకులకు టీడీపీ ఇన్​చార్జ్​ విఎస్​ అమీర్​బాబు ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి అజ్మత్ మోటార్స్ అధినేత అజ్మతుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా మాట్లాడుతూ కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో పేదలకు జీవనోపాధి లేక .. ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కష్టాలు తెలుసుకున్న వారే… సహాయం చేసేందుకు ముందుకు వస్తారని, టీడీపీ కడప అసెంబ్లీ ఇన్​చార్జ్​ వీఎస్​ అమీర్​బాబు రిమ్స్​ వద్ద కోవిడ్​ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వారికి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో శివకొండా రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జలతోటి జయకుమార్, ఛాన్ బాష, షఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author