PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ..

1 min read

– కస్తూరిబా పాఠశాల బోరు బావి పరిశీలన : జిల్లా జి సి డి వో సునీత
– మురుగు నీటి ప్రాంతాన్ని శుభ్రం చేయించిన అధికారులు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని కస్తూరిబా గాంధీ గురుకులను జిల్లా సమగ్ర శిక్ష గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి సునీత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు సంబంధించిన బోరు బావి దగ్గర నిల్వ వుండే మురుగునీటి ప్రాంతాన్ని పరిశీలించి, అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మంచినీటి బోరు దగ్గర మురుగునీరు నిలవ ఉండడంతో త్రాగునీటి దుర్వాసన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు, జిల్లా అధికారి అడిగే ప్రశ్నలకు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విద్యావతి పొంతనలేని సమాధానం ఇవ్వడంతో జిల్లా అధికారి అసహనం వ్యక్తంచేశారు, బోరు బావి దగ్గర నెలకొన్న సమస్యపై ఎందుకు దృష్టి సారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, బోరు బావి కోసం ప్రతినెలా చెల్లించే విద్యుత్ బిల్లులపై అరా తీశారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఇక ముందు మురికినీరు నిల్వ వుండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్ఓ కు సూచించారు.

About Author