PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్దిని దర్శించుకున్న హీరో సాయిధరమ్‌ తేజ్‌ 

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామిని బుధవారం సినీనటులు సాయిధరమ్‌తేజ్‌ దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు సాయిధరమ్‌ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాయి ధరమ్‌ తేజ్‌ చే తమలపాకుల పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈవో ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.  అభిమానులు అధిక సంఖ్యలో తమ అభిమాన నటుడికి చూసేందుకు మద్ది క్షేత్రానికి వచ్చారు. ధర్మకర్తల మండలి సభ్యులు మల్నీడి బాబి, బి. నాగలక్ష్మీ, జె. దుర్గమ్మ, పి. యువరాణి, కె. రవి, మద్ది ఆలయ మాజీ చైర్మన్‌ మద్దాల ప్రసాద్‌ పాల్గొన్నారు.

About Author