PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కెజిబివి విద్యార్థులను అభినందించిన కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రమైన కస్తూర్బా గాంధీ విద్యాలయ బాలికలను ఉమ్మడి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అభినందించారు.ఈనెల 11వ తేదీన కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో జరిగిన ఆట్యా పా ట్యా ఆటల పోటీలలో కస్తూర్బా  పాఠశాలలో చదువుతున్న 9,10వ తరగతి విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో బాలికలు రెండవ స్థానంలో నిలిచారని పాఠశాల ఎస్ఓ.విజయలక్ష్మి,పిఈటి సుమలత తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకుగాను కర్నూలు జిల్లా ఉమ్మడి కలెక్టర్ జి.సృజన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేస్తూ మేమెంటోలను అందజేశారు.ఆటల పోటీల్లో రాబోయే రోజుల్లో ఇంకా మంచి ప్రతిభ కనబరుస్తూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ విద్యార్థులకు తెలియజేశారు.రాష్ట్రస్థాయిలో జరిగే ఆటల పోటీలకు ముగ్గురు విద్యార్థులు కే. భువనేశ్వరి,బి.కవిత,జి.సంధ్యారాణి ఎంపిక అయ్యారు.ఈనెల 19,20 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.విద్యార్థులను పాఠశాల ఎస్ఓ. విజయలక్ష్మి,పిఈటి సుమలత పాఠశాలలో విద్యార్థులను అభినందించారు.

About Author