PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యల పరిష్కారమే గడపగడప లక్ష్యం

1 min read

– అర్హులైన ప్రతి కుటుంబానికి- సంక్షేమ పథకాలు 

 – గడప గడప కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం

 – ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ-

 – అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్న.. ఎమ్మెల్యే, పోచంరెడ్డి,రవీంద్ర నాథ్ రెడ్డి,

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఎక్కడన్నా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించడమే గడపగడపకు మన ప్రభుత్వం లక్ష్యమని అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం చెన్నూరు టౌన్ లోని రాజుల కాలనీ, సరస్వతీ నగర్, కొత్త గాంధీనగర్ పరిధిలోని కుమ్మర కాలనీ, ఎరుకల కాలనీ, బెస్త కాలనీ, బుడ్డాయపల్లి గ్రామ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అలాగే ఆయన తనయులు నరేన్ రామాంజనేయుల రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందించడం అందించడం జరుగుతుందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి 2 వేల 5 వందల నుండి 2 వేల 7 వందల50 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం బెస్త కాలనీ ప్రజలు, తమకు డ్రైనేజీ సమస్య ఉందని డ్రైనేజీ నీళ్లు వెళ్లడం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే కొత్త గాంధీనగర్ లోని దిగువన ఉన్న ఇండ్ల వద్ద రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే మాకు రోడ్డు వేయించాల్సిందిగా యువ నాయకులు చిత్తకొమ్మదిన్నె జడ్పిటిసి నరేన్ రామాంజనేయుల రెడ్డిని అడగడం జరిగింది, వెంటనే ఆ సమస్యలకు సంబంధించిన పనులు చేపట్టడం జరుగుతుందని అక్కడ ప్రజలకు వారు హామీ ఇవ్వడం జరిగింది, మరి కొంతమంది ఇంటి స్థలాలు కావాలని కోరడం జరిగింది, సానుకూలంగా వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే అక్కడ అధికారులను ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించడం జరిగింది, అదేవిధంగా కొంతమంది రైతులు రైతు భరోసా పడలేదని , ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి తెలియజేశారు,స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు , ఇంటి స్థలాలు, పక్కా గృహాలు ప్రభుత్వపరమైన ఏ సంక్షేమ పథకమైన అందేవిధంగా గ్రామ వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలియ చేశారు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య , అదేవిధంగా రేషన్ కార్డులు కావాలని, ఆధార్ కార్డు లు మార్పులు చేర్పులు కావాలని, అడిగే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు తెలియజేశారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు, మీరు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులు అంతా కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు, మీ సమస్యలు తెలుసుకునేందుకే మీ ఇంటి వద్దకే రావడం జరిగిందని ఆయన ప్రజలను పదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఆ పథకం అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు, అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ , వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి , , సర్పంచులు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, గుమ్మల మధుసూదన్ రెడ్డి, రఘురామిరెడ్డి, సాదిక్ అలీ, రఘురాం రెడ్డి, దుంప నాగిరెడ్డి, కమలాపురం నియోజకవర్గం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, ఆదినారాయణ, చంద్ర, రమణ, బాబు, బోలా వెంకటసుబ్బయ్య, బోల కుమార్, బోలా సుధాకర్, శంకర్, టి ఎన్ చంద్ర రెడ్డి, టిఎన్ మహేశ్వర్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,, అబ్దుల్ రబ్, వైఎస్ఆర్సిపి నాయకులు , మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author