PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మ గాంధీ మార్గం అనుసరణీయం… మాజీ రాజ్యసభ సభ్యులు టి జి వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గం ప్రతి ఒక్కరు అనుసరించదగ్గదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగాస్థానిక జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అహింసే ఆయుధంగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికే దక్కుతుందని టీజీ వెంకటేష్ అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లిన మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి అంటే ఆయన ఘన కీర్తి ఏమిటో మనమర్థం చేసుకోవచ్చన్నారు.  గాంధీ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరిస్తే ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుందని టీజీ అన్నారు. ఇప్పుడున్న వారితో పాటు, రాబోయే తరాల వారు కూడా గాంధీ తత్వాన్ని అర్థం చేసుకుని, గాంధీ మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి పడరవిల్లుతుందని టీజీ వెంకటేష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో టీజీవి ట్రేడ్ యూనియన్ నాయకులు బాలయ్య, పాల్ రాజు, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

About Author