PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని దుకాణాలు దగ్ధం

1 min read

  రూ 2 లక్షల నష్టం

పల్లెవెలుగు    వెబ్  చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని రిక్వెస్ట్ స్టాఫ్‌ వద్ద పేదవారు ఏర్పాటు చేసుకున్న రెండు శీతల పానీయ దుకాణాలు బుధవారం తెల్లవారుఝామున ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని దగ్ధమయ్యాయి.చాగలమర్రి పట్టణానికి చెందిన భాష,రమణయ్యలు ఏర్పాటు చేసుకున్న శీతల పానీయ దుకాణాలలో జరిగిన  అగ్నిప్రమాదంలో  కూలింగ్‌  మిషన్‌,ప్రిడ్డ్‌లు,శీతల పానీయాలు కాలిపోయి బాధితులకు బారీ నష్టం వాటిల్లింది.స్థానికులు మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదంలో సుమారు రూ 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.విషయం తెలుసుకున్న జేసిఎస్‌ జిల్లా అధ్యక్షుడు షేక్.బాబులాల్‌ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్సించారు.ప్రభుత్వం స్పందించి  ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

About Author