PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ…

1 min read

– ప్రయాణికుడు పోగొట్టుకున్న నగదు అందజేత

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు  పోగొట్టుకున్న ఆధార్ కార్డు ,  నగదును బాధితుడికి  అందజేసి, నిజాయితీని నిరూపించుకున్నారు  ఆర్టీసీ కండక్టర్‌ లింగయ్య. ఈ సంఘటన నందికొట్కూరు లో సోమవారం చోటు చేసుకుంది.ఆదివారం నందికొట్కూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ39 టికే 5599  నందికొట్కూరు నుంచి నంద్యాల కు బయలుదేరిన   బస్సులో గడివేముల గ్రామానికి చెందిన వ్యక్తి  ఎక్కి ప్రయాణం చేశాడు. గడివేముల  లో దిగినేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లగానే తన పర్సు పోగొట్టుకున్న విషయం తెలిసింది . పర్సు ను  గమనించిన కండక్టర్‌ భద్రపర్చాడు. విషయాన్ని డిపో మేనేజరు నాగేశ్వరరావు , కంట్రోలర్ శేషన్న ల  దృష్టికి కండక్టర్ తీసుకెళ్లారు. పర్సు లొనీ ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ ద్వారా బాధితుని కీ విషయం తెలియజేశారు.సోమవారం బాధితుడికి రూ.5 వేలు నగదు, ఆధార్ కార్డు ,తదితర వస్తువులను డిపో మేనేజర్, కంట్రోలర్, సెక్యూరిటీ సిబ్బంది  సమక్షంలో అందజేశారు. కండక్టర్ నిజాయితీ ని మెచ్చుకుంటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

About Author