PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ సీఎం కెసిఆర్ నవ్వుతున్నారు..

1 min read

– అభివృద్ధి చేయలేక దుర్మార్గంగా చంద్రబాబును జైలుకు

– టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ 

పల్లెవెలుగు వెబ్ కడప :  52 రోజుల పాటు చంద్రబాబు నాయుడును జైల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ సాధించిందో ప్రజలకు చెప్పాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ డిమాండ్ చేశారు.కడపలోగురువారంమన్నూరు అక్బర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయకుండా మళ్ళి ఎలా అధికారములోకి రావాలని ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడిని దుర్మార్గంగా జైల్లో పెట్టి ఆయన కున్న ఆరోగ్య సమష్యల్ని ఇంకా పెద్ద సమష్యగా చేసి రాజకీయాలనుండి తప్పియ్యాలనే ఉద్దేశ్యంతో ఆయన ప్రణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంటె అంధకారం అనితెలంగాణ  అంటే డబల్ రోడ్స్,వెలుగులు అని తన ప్రజలతో సంతోషంతో పంచుకుంటూ తన రైతాంగాన్ని ఆకాశంలోకి ఎత్తుతుంటే. యిక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జరిగిన అభివృద్ధిని సర్వనాశనం చేస్తూ ప్రశ్నించే వారిని, అడ్డొచ్చే వారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురించేస్తున్నారని మరో పక్క ఏపీలో రైతాంగం సకాలంలో పంటలకు నీరు లేక విల విల బోతున్నారని అయినా ఈ ప్రభుత్వంనకు మనసు కరగడం లేదు అని అది మనసా బండారయా అని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం దిగిపోయి ప్రజాస్వామ్యం కాపాడే చంద్రబాబు రావాలని, వస్తే అమరావతి రాజధాని,పోలవరం ప్రాజెక్టు, రైతాంగం, ఐటీ, మహిళా సాధికారుత,విద్య, వైద్యం, సంక్షేమము-అభివృద్ధి జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి గగ్గుటూర్ నజిర్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు నాదెండ్ల దస్తగిరి,మైనారిటీ నాయకులు రూపనగుడి హుస్సేన్, రాజంపేట అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

About Author